. ప్రారంభించిన మేయర్ నీతూకిరణ్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ లో వారాహి జుయెలరీ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్, విజయవాడకు చెందిన వారాహి సంస్థ ఎగ్జిబిషన్ ను నగర మేయర్ దండు నీతూకిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జుయెలరీ ప్రేమికుల కోసం వారాహి జుయెలరీ ఆధ్వర్యంలో నగరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ కు దీటుగా నిజామాబాద్ వజ్ర వ్యాపారంలో ఎదుగుతోందన్నారు. త్వరలో నిజామాబాద్ లో వారాహి జుయెలరీ షోరూం ప్రారంభించాలని కోరారు. అనంతరం వారహి ఎండీ సందీప్ మాట్లాడుతూ.. తమ సంస్థలో ప్రతి గ్రాముకు రూ.150 డిస్కౌంట్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య రక్ష యోగా కేంద్రం నిర్వాహకురాలు ఐశ్వర్య కాలే, వారాహి మేనేజర్ అనంతరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ లాలయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.