రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి…

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం

నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు పట్టాలు దాటుచుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒ యువకుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి . రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతికి చెందిన ఘటన నిజామాబాద్ నగర రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తి దగ్గర వివరాలు వెతకగా బాన్సువాడ నుంచి నిజామాబాద్ కు వచ్చిన బస్సు టికెట్ లభ్యమయింది. అలాగే అతని చెయ్యి పై ఆర్ఆర్ఆర్ అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతుని వివరాలు తెలిసినా వారు రైల్వే ఎస్ఐ 8712658591 నంబర్ కు తెలుపగలరని సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిజామా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి పేర్కొన్నారు.

Unidentified youth dies after being hit by a train...
Comments (0)
Add Comment