– జిల్లా ఇంటర్ విద్యా అధికారి
నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 11 వ తేదిన ఉదయం 11 గంటలకు నిర్వహించే జిల్లా స్థాయి అండర్ 19 టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలలో పాల్గొన దలచిన పాఠశాల, జూనియర్ కళాశాల స్థాయి విద్యార్థిని, విద్యార్థులు హాజరు కావాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహించే ఈ పోటీలకు నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా విద్యార్థిని విద్యార్థులు బోనోఫైడ్ తో హాజరు కావాలని తెలిపారు.