- రెవిన్యూ రికార్డులలో బోందం చెరువు విస్తీర్ణం 23.03 ఎకరాలు
- బోందం చెరువు శిఖం భూమిలోనే వెంచర్
- ప్లాట్లు చేసి విక్రయించింది కార్పోరేటర్ల భర్తలే
- రెవిన్యూ శాఖ ఇచ్చిన నోటిస్ లను తొక్కిపెట్టిన నేతలు
- పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన
- మేయర్ భర్త శేఖర్, అతని అనుచరులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- బాధ్యులపై చర్యలు తీసుకుని వారికి న్యాయం చేస్తామని షబ్బిర్ ఆలీ హామీ
బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 10 వ డివిజన్ లోని బోందం చెరువు శిఖం, భారతీ రాణీ కాలనీలో శనివారం జిల్లా అధికార యంత్రాంగం కూల్చివేసిన నిర్మాణాలు ఆక్రమణలుగా తేలాయి. స్థానిక నేతలే చెరువు శిఖం భూమిలోనే 65 ప్లాట్లను చేసి విక్రయించినట్లు తేలింది. పోలిస్ బందోబస్తు మధ్య రెవిన్యూ అధికారులు శనివారం 35 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. చెరువు శిఖం భూమిలో అప్పటి బిఆర్ఎస్ నే తలు తమ పరపతి పలుకుబడిని ఉపయోగించి ముందుగా రోడ్లు వేసి తరువాత విధ్యుత్ పోల్స్ లను ఎర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాం లో సెల్ఫ్ అసెస్మెంట్ కింద ఆస్థి పన్నులు చెల్లించిన వారికి ఇంటి నెంబర్ లు కేటాయించగా వాటి ద్వార వార్డ్ బ్లాక్ రిజిస్ర్టేషన్ లు చేశారు. వెంచర్ చేసింది 10,11 వ డివిజన్ లకు చెందిన కార్పోరేటర్ల భర్తలే కావడంతో అమాయకులైన పేదలు అక్కడ రూ.1,50,000 మొదలు కొని రూ.2.50 లక్షలకు ఒక్క ప్లాట్లను కొనుగోలు చేశారు. స్థలం ఉండటం, విద్యుత్ లైన్ లు, నల్ల కనేక్షన్ లు ఉండటం తో పాటు ఆస్థి పన్ను చెల్లించడం, రిజిస్ర్టేషన్ కావడంతో చాల మంది అమాయకులు వాటిని లక్షలు పోసి కొన్నారు. కాని తీరా ప్రభుత్వం మారడం కొత్త సర్కారు హయాంలో చెరువు శిఖం భూములతో పాటు సర్కారు భూములను కాపాడాలని నిర్ణయించి బోందం చెరువు శిఖం భూమిలో ఉన్న నిర్మాణాలను అక్రమ నిర్మాణాలు అంటు కూల్చివేయడంతో నేతలు సర్కారు భూమిలో వేసిన వెంచర్ వ్యవహరం బహిర్గతమైంది.
నిజామాబాద్ రెవిన్యూ శాఖలో నిజామాబాద్ 10 డివిజన్ లోని నాగారం 80 క్వార్టర్స్ వద్ధ ఉన్న బోందం చెరువు రెవిన్యూ రికార్డుల ప్రకారం బోందం చెరువు విస్థిర్ణం 23 ఎకరాల 03 గుంటలుగా తేలింది. అది 2016 వరకు రెవిన్యూ పహనీలలో ప్రభుత్వ భూమిగానే ఉంది. 2016 తరువాత 10,11 డివిజన్ ల కార్పొరేటర్లుగా బిఆర్ఎస్ తరుపున మహిళలు గెలిచిన తరువాత బోందం చెరువు శిఖం భూమిపై మహిళ కార్పొరేటర్ల భర్తల కన్ను పడింది. అప్పటికే చుట్టు ప్రక్కల ప్రాంతాలలో తమ అనుచరుల ద్వార జర్నలిస్టులకు, వికలాంగులకు, బిడి కార్మీకులకు, దడువాయిలకు, చాటా కార్మీకులకు ఇచ్చిన ప్లాట్లలో లబ్ధిదారులు పోజిషన్ లలో లేకపోతే కబ్జాలకు పాల్పడ్డారు. అక్కడ పాత పట్టాలను రద్ధు చేశారని కొత్త పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసిందని డబ్బులు పుచ్చుకుని అక్కడ ఇతరులకు ప్లాట్లను విక్రయించారు. అది పూర్తి కాగానే బోందం చెరువు శిఖం భూమిపై కన్ను పడి దానిలో గుట్టు చప్పుడు కాకుండా అప్పటి రెవిన్యూ, మున్సిపల్, విధ్యుత్, రిజిస్ర్టేషన్ ల శాఖాధికారులకు కుమ్మక్కై ప్లాట్లను అమ్మకాలు చేసి కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. ఇటివల కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత బోందం చెరువు శిఖంలో వెలిసిన వెంచర్ ల వివరాలను కొందరు సమాచార హక్కు చట్టం ద్వార సేకరించగా అది ప్రభుత్వ భూమిగా తెలింది. దానితో ఆక్రమ నిర్మాణలను కుల్చివేస్తామని రెవిన్యూ శాఖాధికారులు 65 ప్లాట్ల యజమానులకు నోటిస్ లు ఇచ్చింది. కాని అక్కడ ప్లాట్ల దందా చేసిన కార్పొరేటర్ల భర్తలు వాటిని తొక్కిపెట్టారు.
శనివారం రెవిన్యూ అధికారులు బోందం చెరువు శిఖం భూమిలో వెలిసిన వెంచర్ ఏర్పాటు అక్రమం అని అందులో నిర్మాణాలు కూల్చివేత చెపట్టడంతో బాదితులు ఎమి చేయలేకపోయారు. అక్కడ తమకు ప్లాట్లను విక్రయించిన వారికి ఫోన్ చేసిన వారు స్పంధించలేదు.వారు కనబడక పోయేసరికి వారు తమ గోడు ఎవ్వరికి చెప్పుకోవాలో ఆర్థం కాలేదు . వారికి ఎంఐఏం నేతలు, కాంగ్రెస్ నేతలు మద్ధతు పలికారు. అదివారం బాధితులు తమకు అక్కడ ప్లాట్లను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలిస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. తమకు ప్లాట్లను విక్రయించిన మేయర్ దండు నీతు కిరణ్ భర్త దండు చంద్ర శేఖర్,10 వ డివిజన్ కార్పోరేటర్ కోమల్ భర్త నరేష్ తో పాటు మరో ఇద్ధరిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం నిజామాబాద్ పోలిస్ కమీషనర్ కు క్యాంపు కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా బోందం చెరువు భాధితులకు రాష్ర్ట ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ సంఘీబావం తెలిపారు. ప్లాట్లుగా చెసి విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశిస్తామన్నారు. చెరువు శిఖం భూమిలో ప్లాట్ల లేక పట్టా భూమిలో వెంచర్ చేశారా అనేది రెవిన్యూ అధికారులతో ఆరా తీస్తామన్నారు. ఈ ఎడాది చివరి వరకు ఇందిరమ్మ ఇండ్లను కట్టించి కొత్త కాలని ఏర్పాటు చేస్తామని బాధితులకు హమీ ఇచ్చారు.