- కానస్టెన్సీ బీజేపీ ఇంచార్జ్ డా. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి
బతుకమ్మ, భీంగల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ బాల్కొండ కానిస్టెన్సీ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు . శనివారం భీంగల్ మండలం దేవక్కపేట్ గ్రామం లో వర్షాలకు నష్ట పోయిన పంటలను, కోతకు గురైన పొలాలను, ఇసుక మేటలు వేసిన భూములను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు వర్షాలు తీవ్ర నష్టం తెచ్చి పెట్టాయని అన్నారు. ఇసుక మేటలు వేసిన, కోతకు గురైన భూములు సాగులోకి రావాలి అంటే ఎకరానికి రూ లక్ష ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. కురిసిన వర్షాలకు సొయా, మొక్క జొన్న, పెసర తదితర వాణిజ్య పంటలు చేతికి రాకుండా పోయినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పంటల నష్టాన్ని అంచనా వేయించి రైతులకు ఎకరానికి పది వేయిల చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు మహిపాల్, నాగార్జున రెడ్డి, ఏషాల గంగాధర్, భాశెట్టి శ్రీను తదితరులు ఉన్నారు.