ఉపాధ్యాయ సంఘ భవనాలకు కేటాయించిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి

  • విద్య రంగానికి కేటాయించాల్సిన డబ్బులు ఉపాద్యాయ సంఘ భవనాలకు కేటాయించడం సిగ్గుచేటు
  • భారతీయ విద్యార్థి మోర్చ   BVM రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ 

బతుకమ్మ, నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక చాలామంది విద్యార్థులు అవస్థలు పడుతుంటే వాటికి కేటాయించాల్సిన డబ్బులను ఎమ్మెల్సీ రఘోత్తమ రెడ్డి పిఆర్టియు భవనాలకు 25 లక్షలు కేటాయించడాన్ని భారతీయ విద్యార్థి మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది.  ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేకుండా కనీస మౌలిక సదుపాయాలు లేకుండా చాలామంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధ్యాయులు కొరత వలన పాఠశాలలో మూతపడే అవకాశం కనిపిస్తుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక గ్రామంలో పాఠశాల భవనం లేకపోవడం వల్ల రేకుల షెడ్డులో కొట్టుమిట్టాడుతూ విద్య బోధన చేస్తున్నారు. అలాంటి వాటికి కేటాయించాల్సిన డబ్బులను ఎమ్మెల్సీ గారు ఉపాధ్యాయ సంఘానికి 25 లక్షలు కేటాయించడం అనేది సిగ్గుచేటు. ఒక బాధ్యత గల వృత్తిలో ఉండి విద్యార్థులకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈరోజు వాళ్ళ స్వార్థా రాజకీయాల కోసం వాడుకోవడం మానుకోవలి. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి వాటి అభివృద్ధి పై ప్రభుత్వంతో చర్చించిన దాఖలాలు లేవన్నారు.కావున ఎల్లారెడ్డి సంఘ భవనానికి 10 లక్షలు, బిక్నూర్ సంఘ భవనానికి 10 లక్షలు ,కామారెడ్డి సంఘ భవనానికి ఐదు లక్షలు కేటాయించిన నిధులను వెంటనే ఉత్తర్వులను రద్దు చేసి ఆ డబ్బులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో విద్యార్థులతో విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని భారతీయ విద్యార్థి మోర్చ BVM గా హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్, ఉపాధ్యక్షులు అర్బస్ ఖాన్,కామారెడ్డి బాద్యులు పెరుమాండ్ల బుల్లెట్, నాయకులు రాజు, రాహుల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

The orders allotted to teachers' union buildings should be canceled immediately
Comments (0)
Add Comment