రుణమాపి పొందిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

–రుణమాఫీ కానీ రైతులు హెల్ప్ లైన్ ను సంప్రదించాలి

–పిఎసిహెచ్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి

ఇందల్వాయి, బతుకమ్మ :

తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని దీనిని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇందల్వాయి పిఎసిహెచ్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి అన్నారు..అలాగే రుణమాఫీ కాని వారు సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఇందల్వాయి మండల కేంద్రంలోని  పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ రైతు రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా లోన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఇందల్వాయి పిఎసిఎస్ పరిధిలోని 429 రైతులకు మూడు విడుతలలో రెండు కోట్ల పదమూడు లక్షల పైన లోన్లు ఇప్పించడం జరిగిందని తెలిపారు.అలాగే కొత్తగా రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న రైతులకు ఒక కోటి 22 లక్షలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.289 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని  కోరారు. దీనిని సంబంధిత అధికారులకు మండల ఏవో,ఏఈఓ లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మెండే రవి తదితరులు ఉన్నారు.రు.

The credit goes to the Congress government for providing financial assistance to the loan waiver beneficiaries
Comments (0)
Add Comment