. . . 10140 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం
బతుకమ్మ, నిజామాబాద్ క్రైం
నగరంలోని 4వ టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆదివారం సిపి ఆదేశాల మేరకు ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సిఐ పురుషోత్తం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 11మంది పేకాట రాయళ్లు,8 సెల్ ఫోన్లు, 10140 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.