- బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి
బతుకమ్మ, పిట్లం : బాన్సువాడ డిపో ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి కోరారు. పిట్లం మండల కేంద్రంలో గల ఫంక్షనల్ యజమానులతో మాట్లాడి శుభకార్యాలకు ఆర్టీసీ ఇస్తున్న రాయితిని వాటి వివరాలను వెల్లడించారు. 200 కిలోమీటర్ల మేర ఒక సభ్యునికి 63 రూపాయలు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కాగా ఎక్స్ప్రెస్ బస్సులకి 200 కిలోమీటర్లకు ఒక్కొక్కరికి 64 రూపాయల చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. 10 శాతం రాయితీతో ఇప్పుడు ఆర్టీసీ బస్సులను అందిస్తున్నామని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని బాన్సువాడ డిపో పరిధిలోని బస్ స్టేషన్ కంట్రోలర్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి మండలంలో గల ఫంక్షన్ హాల్ యజమానులతో మాట్లాడి ఎవరికైనా రాయితీపై ఆర్టీసీ సేవలు కావాల్సిందే తమకు సంప్రదించాల్సిందిగా వారికి రాయితీ పత్రాలను తోపాటు కన్సల్టెన్ చేయాల్సిన నంబర్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పిట్లం బస్ స్టేషన్ కంట్రోలర్ సాయన్న,కండక్టర్ గంగాధర్,వినోద్,ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.