విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి

బతుకమ్మ, మోర్తాడ్ : విద్యార్థులు మొదటి నుంచి ఉన్నత లక్ష్యంతో చదవాలని లక్ష్యాన్ని చేరుకోనే విధంగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తేవాలని డాక్టర్. రవి కంటి చాందిని, కృష్ణ చైతన్యలు అన్నారు. మంగళవారం మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున 100 మందికి రూ. 50 వేల విలువ గలిగిన ఏక రూప దుస్తులను అందజేశారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు ” బ్లెజర్ ” అందించారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది పవన్ కుమార్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

 

Students should study with high aim
Comments (0)
Add Comment