డెంగీతో విద్యార్థిని మృతి

బిచ్కుంద, బతుకమ్మ:  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన 14 ఏళ్ల సిద్ధేశ్వరి డెంగీ బారిన పడి మృతి చెందింది. బిచ్కుందలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న సిద్ధేశ్వరికి 15 రోజుల క్రితం తీవ్రజ్వరం రావడంతో విద్యాలయ సిబ్బంది తల్లిదండ్రుల వద్దకు పంపించారు. తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందింది.

Student died of dengue
Comments (0)
Add Comment