కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

  • సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్ 

బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : సిరికొండ, ధర్పల్లి మండలాల్లో కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్టు షాపులలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నాసిరకం,కల్తీ మద్యంను అరికట్టాలని సీ. పీ. ఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు. శనివారం సిరికొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ సిరికొండ ధర్పల్లి మండలాల్లో మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి మద్యం ప్రియులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. గ్రామాల్లో వీడిసిలతో కలిసి టెండర్లలో వేలం పాడి కల్తీ మధ్యాన్ని విచ్చలవిడిగా, ఇష్టమైన ధరలకు విక్రయిస్తూ ప్రజలను ఆర్థికంగా దోపిడికి గురి చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మద్యం బెల్ట్ షాపులను హరికడతామని హామీ ఇచ్చి దాని ఊసు ఎత్తడం లేదు అన్నారు. జిల్లాలోని అబ్కారీశాఖ అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతూ నియంత్రించాల్సింది పోయి చోద్యం చూస్తున్నారన్నారు. సిరికొండ,ధర్పల్లి వైన్స్ యజమాన్యాలు తమ లాభపేక్షను చూపి అందిన కాడికి దండుకుంటున్నారన్నారని ఆరోపించారు ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ” మద్యం వ్యసనంతో చితికి పోయిన మద్యం ప్రియులను అర్థికంగా దెబ్బతిస్తున్నారన్నారు. గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మద్యంపై, నాసిరకం, నకిలీ మద్యంపై ప్రజలు ముందుకు వచ్చి దాడులు చెసే అవకాశం ఉంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సిరికొండ, ధర్పల్లి వైన్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ డివిజన్, మండల నాయకులు ఆర్.దామోదర్,ఎం. సాయరెడ్డి,ఈ.
రమేష్,కే.ఆశిస్ లు పాల్గొన్నారు.

Strict action should be taken against the sale of adulterated liquor.
Comments (0)
Add Comment