- ఇస్కాన్ కంటేశ్వర్ అధ్యక్షులు రమా నంద్ రయా గౌర
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించనున్నామని ఇస్కాన్ కంటేశ్వర్ ఇందూరు అధ్యక్షులు రమానంద రయా గౌర అన్నారు. ఈరోజు విజయలక్ష్మి గార్డెన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించనున్నామని అన్నారు. ఉదయం ఇస్కాన్ కేంద్రంలో ఐదు గంటల నుంచి మంగళ హారతి, గురుపూజ, శ్రీమద్ భాగవత ప్రవచనం, 10 గంటలకు గోపూజ అనంతరం నగర సంకీర్తన నిర్వహించి, మధ్యాహ్నం విజయలక్ష్మి గార్డెన్ లో రెండు గంటలకు నగర సంకీర్తన సాంస్కృతిక కార్యక్రమాలు సంధ్య హారతి, నామం- నిత్యం శ్రీకృష్ణ ప్రీత్యర్థం, రాత్రి 12 గంటలకు మహా హారతి ఉపవాస ప్రసాద వితరణ నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ స్వచ్ఛంద విరాల సేవలు 5001 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం రోజున విశేష కార్యక్రమాలు అయిన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన హరినామ సంకీర్తన భగవద్గీత ప్రవచనం మహా హారతి అన్న ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీతాయ్ చంద్ నర ఈశ్వర్, రమణ గోపీషా దాసు, టీ శక్తి సాయిలు ప్రభుజీ, మహాప్రభు మహేశ్వర్ దాస్ తదితరులు పాల్గొన్నారు.