డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా పోటీలు ప్రారంభం

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ మైదానంలో గురువారం క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, టీజీవో జిల్లా అధ్యక్షులు సంగం అమృత్ కుమార్ లు పాల్గొన్నారు. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను మొదటగా అభినందించి, క్రీడలను ప్రారంభించారు. అనంతరం హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జన్మదినని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వివిధ క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన ఉద్యోగ క్రీడాకారులందరినీ అభినందించి, బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా కార్యదర్శి హనుమంత్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్,టిఎన్జీవో కేంద్ర బాధ్యులు సతీష్ , పోలశ్రీనివాస్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు,వివిధ శాఖల ఉద్యోగులు,అధిక సంఖ్యలో హాజరై క్రీడలను విజయవంతం చేశారు.

 

Sports competitions started under the auspices of TNGO
Comments (0)
Add Comment