పంట రుణాల రెన్యూవల్ లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

బ్యాంకర్లు, వ్యవసాయాధికారులతో కామారెడ్డి కలెక్టర్ ఆవిష్ సాంగ్వాన్ సమీక్ష
బతుకమ్మ, కామారెడ్డి : పంట రుణమాఫీ జరిగిన రైతుల వ్యవసాయ ఋణాలు రెన్యువల్ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ తన కార్యాలయ ఛాంబర్ లో బ్యాంకర్లువ్యవసాయ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూజిల్లాలోని అన్ని బ్యాంకులలో ఏ మేర వ్యవసాయ రుణాలు రెన్యువల్ జరిగాయి,ఎంతమంది ఋణాలు రెన్యువల్ కాకుండా ఉన్నాయో అనే విషయాలపై సమీక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,డీసీసీబీ బ్యాంకుల రెన్యువల్ శాతం మరింతగా పెంచాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. ఋణ మాఫీ జరిగిన రైతుల వ్యవసాయ ఋణాల రెన్యువల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 83 శాతం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 81 శాతం,కెనరా బ్యాంక్ 70 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 శాతం,డీసీసీబీ 39 శాతం మాత్రమే అభివృద్ధి సాధించాయని పేర్కొన్నారు. సొసైటీ వారీగా రుణమాఫీ వివరాలు,పంట రుణాల రెన్యూ వాల్స్ సమర్పించాలని జిల్లా సహకార అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు పంట రుణాల రెన్వాల్స్ విషయమై బ్యాంక్ బ్రాంచీలు వారీగా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆధార్ నెంబర్ సరి చేసుకొనుటకు బ్యాంక్ నోడల్ అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆర్.తిరుమల ప్రసాద్, ఎల్.డి.ఏం. బి.రవికాంత్, ఎస్ బిఐ ఏజీఎం వి.చంద్ర శేఖర్, డీఎం సండిల్య, డీసీసీబీ డీజీఎం సుమ మాల, ఇతర అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.

Special measures should be taken in the renewal of crop loans
Comments (0)
Add Comment