బతుకమ్మ, కామారెడ్డి : వన మహోత్సవం లో విశ్రాంత ఉపాధ్యాయులు పిచ్చుక హను మండ్లు చేసిన కృషికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆయనను బుధవారం సన్మానించారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని తన ఇంటి ఆవరణలో 300 మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నాడు. తాను పని చేసిన ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో మొక్కలు నాటి ంచారు. దీన్ని గుర్తించిన కలెక్టర్ తన కార్యాలయంలో శాలువా తో సన్మానించి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.సురేందర్ పాల్గొన్నారు.