బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం గద్దగుండు తాండ పరిధిలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ప్రక్కన గల ఖాళీ (ప్రభుత్వ) స్థలంలో పిడి సురేందర్ సోలార్ యూనిట్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేశారు. ఆయన విలేకరితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సోలార్ కుసుం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని అందులో భాగంగానే పిట్లం మండల కేంద్రంలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ సోలార్ కుసుం ఏర్పాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యేవిధంగా చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం శిరీష, సీసీ లు రాజు, ముత్యం రెడ్డి, రాజేశం ఉన్నారు.