బతుకమ్మ నిజామాబాద్ సిటీ : శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ పురస్కరించుకొని సుభాష్ నగర్ లోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో శనివారం పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోవేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలతో అలరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో కులమతాలకు సంబంధం లేకుండా అన్ని పండగల సంస్కృతి సంప్రదాయాలను చదువుతోపాటు పండగల యొక్క విశిష్టతలను తెలపడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామనిఆయన పేర్కొన్నారు. చిన్ని కృష్ణుని వేషాధారణలో విద్యార్థులు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, తమ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని అన్నారు.
Related