ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి

బతుకమ్మ, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిమల సురేష్ డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమ ఫలితంగా సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఈ వర్గీకరణను రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన అమలు చేయాలని తెలిపిందన్నారు. తీర్పు ఇచ్చి ఎన్ని రోజులైనా రాష్ట్రంలో ఇలాంటి జీవుని విడుదల చేయకపోవడం వల్ల మాదిగ దాని ఉపకులాలకు ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా ఉద్యోగుల నోటిఫికేషన్లు, ఉద్యోగాల ప్రమోషన్లలో దీవెన అన్యాయం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎస్సీ వర్గీకరణ జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చట్టం తేవాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిమల సురేష్, కన్వీనర్ తెడ్డు గంగారం, కమిటీ సభ్యులు రమేష్, మారుతి, నరేందర్, శ్రీనివాస్, అబ్బులు, రాములు, సూరజ్, భాస్కర్, మహేష్, సిహెచ్ గంగాధర్ పాల్గొన్నారు.

SC classification should be implemented immediately
Comments (0)
Add Comment