ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు

  • కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు ఉప కులాలకు న్యాయం
  • అన్నా బాహు సాఠే జయంతి వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

బతుకమ్మ,మద్నూర్: ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ధన్నూర్, తడి హిప్పర్గా గ్రామాలలో సాహిత్య రత్న, లోక శాహిర్ అన్నా బహు సాఠే 104వ జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. బుధవారం డా”బి.ఆర్. అంబేద్కర్, అన్నా బహు సాఠే చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీల పట్ల సానులతతో ఉందని దేశంలోనే మొదట ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు అవుతుందని అన్నారు. హన్మండ్లు, ప్రజ్ఞ కుమార్, గంగాధర్, రమేష్, హన్మంత్,బాలు, రోహిత్ దాస్ దళితులు, మహిళలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అప్పటికప్పుడే స్పందించి తారు రోడ్డు

మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి వెళ్లే రోడ్డు సరిగ్గా లేదని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే ప్రజలకు ఇబ్బందులు పడకుండా టిప్పర్లు, ట్రాక్టర్లుతో మట్టి రోడ్డు వేయించారు. గ్రామ ప్రజలు నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

 

SC classification implemented in Telangana state
Comments (0)
Add Comment