సారంగాపూర్ ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించాలి

– లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం
– చెరుకు ఉత్పత్తి దారుల సంఘ కన్వీనర్లు

బతుకమ్మ, బోధన్ : గతంలో ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సారంగాపూర్ ఎన్సిఎస్ఎఫ్ చెక్కర ఫ్యాక్టరీ ని తెరిపించాలని లేదంటే రైతులతో కలిసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్లు ఆకుల పాపయ్య, పృథ్వి రాజ్ హెచ్చరించారు. గురువారం నవీపేట్ మండల కేంద్రం లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య, పృథ్వి రాజ్ ,లు మాట్లాడుతూ వేలాదిమంది రైతుల, కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపి, సహకార రంగంలో లాభాల బాటలో నడిచిన సారంగాపూర్ ఎన్సిఎస్ఎఫ్ చెక్కర ఫ్యాక్టరీ
గత పాలకుల స్వార్ధ ప్రయోజనాల కోసం, తప్పుడు పాలసీల మూలంగా 2008 లో ఫ్యాక్టరీ మూతపడిందని ఆవేదన వ్యక్త పరిచారు, గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఫ్యాక్టరీని తెరిపించి నడిపిస్తామని వాగ్దానం ఇచ్చి పది సంవత్సరాలు కాలయాపన చేయడంతో రైతులు తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గతంలో జిల్లాకు వచ్చినప్పుడు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తానని వాగ్దానం చేశారని గుర్తుచేశారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వాన వేసిన కమిటీ పరిధిలో సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఫ్యాక్టరీని పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ బడ్జెట్లో కనీసం ఫ్యాక్టరీ ప్రస్తావన లేకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో ఫ్యాక్టరీలపై ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి ఫ్యాక్టరీలను తెరిపించితే చెరుకు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఫ్యాక్టరీని తెరిపించి రైతులను కార్మికులను ఆదుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ,చెరుకు రైతు నాయకులు పృథ్వి రాజ్ మచ్చర్ల నాగయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Sarangapur NCSF Sugar Factory should be opened
Comments (0)
Add Comment