బతుకమ్మ, డిచ్ పల్లి: మండల కేంద్రంలోని సాయినగర్ లో రాథోడ్ విజయ(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డిచ్ పల్లిలోని సాయినగర్ కు చెందిన రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ భార్య రాథోడ్ విజయ(30) ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన భర్త వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైదుయలు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. గబ్బర్ సింగ్ కు విజయ రెండో భార్య అని తెలిసింది.