అంబులెన్సు లో గర్భిణీ ప్రసవం

బతుకమ్మ, రెంజల్ :

రెంజల్ మండలం కందకుర్తి కి చెందిన శివని ,(25)నిండు గర్భవతి పురిటి నొప్పులతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు 108 కి కాల్ చేశారు..అంబులెన్సు పైలట్ నాగరాజు గౌడ్ వేగంగా వెళ్లి గర్భిణీనీ రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడున్న సిబ్బంది నిజామాబాద్ వెళ్ళమని సూచించారు…భారీ వర్షం లో కూడా ఎంతో ఓపిగ్గా గర్భిణికి ధైర్యం చెబుతూ మళ్ళీ అంబులెన్సు లో ఎక్కిచుకుని నిజామాబాద్ వెళ్ళే మార్గంలో నవిపెట్ వద్ద తీవ్రమైన నొప్పులు రావటంతో పైలట్ నాగరాజుగౌడ్, డి ఎల్ ఎం టి రాధాకృష్ణ  అంబులెన్సు లోనే ప్రసవం చేశారు.పండంటి పాప పుట్టడడం తో అంత ఊపిరి పీల్చుకున్న రు.తల్లి బిడ్డ క్షేమమని శివని కుటుంబ సభ్యులు అంబులెన్స్ సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. వీరన్న గుట్ట గ్రామానికి చెందిన అంబులెన్సు పైలట్ నాగరాజు గౌడ్ గత 15 సంవత్సరాలుగా అంబులెన్స్ పైలట్ గా పని చేస్తున్నాడు. ఎన్నో వేల మందిని క్షతగాత్రులను రాత్రనక, పగలు అనక ఆసుపత్రికి క్షేమంగా తరలించారు.అతని ఓపిక,డ్రైవింగ్ స్కీల్ తెలిసిన ప్రతి ఒక్కరూ అతనికి వ్యక్తిగతంగా కూడా కాల్  అభినందనలు తెలుపుతున్నారు. ఇలాంటి ఉద్యోగుల వల్ల ఆరోగ్య వ్యవస్థకు ఇంకా గౌరవం పెరుగుతుంది అనటంలో సందేహం లేదు… జిల్లా అధికారులు ఇలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Pregnant delivery in ambulance
Comments (0)
Add Comment