బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామంలో గురువారం గొర్రెలకు మేకులకు ఎలాంటి వ్యాధులు రాకుండా పి పి ఆర్ వ్యాక్సిన్ వేసినటు్ల జుక్కల్ వెటర్నరీ అధికారి పండరినాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో గొర్రెలు, మేకలు చనిపోకుండా ముందు జాగ్రత్తగా పి.పి.ఆర్ వ్యాక్సిన్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ గ్రామంలో 2056 మేకలు ఉన్నాయని అయన అన్నారు. అదేవిధంగా 408 మేకలు ఉన్నాయని మొత్తం 2464 జీవులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.