- వ్యాధి బారిన పడుతున్న విద్యార్థులు
- అంగన్వాడి టీచర్ పైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
- గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వట్లేదని ఆవేదన
బతుకమ్మ ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మన్ పల్లి గ్రామంలో గల అంగన్వాడి స్కూల్లో దాదాపుగా 273 మంది విద్యార్థులు ఉన్నారు. అంకగన్ వాడి సెంటర్ ముందు పెంట కుప్పలు ఉండడం వల్ల ఈగలు దోమలు వాలి విష జ్వరాలు వ్యాపించి విష జ్వరాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడి సెంటర్ ముందు ఉన్న పెంట కుప్పలను తొలగించాలని కోరుతున్నారు. అంగన్వాడి సెంటర్ టీచర్ నిర్లక్ష్యం వల్లనే ఈ పెంట కుప్పలు దర్శనమిస్తున్నాయని వెంటనే అంగన్వాడీ టీచర్ పైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే సమయంలో ఈగలు దోమలు వాలడం వల్ల విష జ్వరాలకు గురికావాల్సి వస్తుందని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలకు సైతం పౌష్టికాహారం అందించడం లేదని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పౌష్టికాహారాన్ని పక్క దారిలో మళ్లించి వారికి ఇచ్చే వాటిని అమ్ముకొని అట్టి డబ్బులు పోగు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే పై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి అంగన్వాడి సెంటర్ ముందర ఉన్న పెంటకుప్పలను తొలగించాలని ఆశిద్దాం