పాతకలెక్టరేట్ వేదికగా పెన్షన్ విద్రోహ దినం

భారీ వర్షాల ఎపెక్ట్…నిరసన వేదిక మార్పు

 బతుకమ్మ, నిజామాబాద్

భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 1 న నిర్వహించే పెన్షన్ విద్రోహ దినం నిరసన కార్యక్రమాల వేదికను  నిజామాబాద్ పాత కలెక్టర్ గ్రౌండ్ నకు మార్చినట్టు  ఎంప్లాయిస్ జేఏసి, జిల్లా చైర్మన్ అలుక కిషన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా  అదివారం నిర్వహించే పెన్షన్ విద్రోహం దినాన్ని పాత కలెక్టర్ గ్రౌండ్  లో గల వేదిక వద్దకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు అందరూ తరలిరావాలని కోరారు. సిపిఎస్ రద్దు కోరుతు జరిగే ఈ నిరసన కార్యక్రమంకు పెద్ధ ఎత్తున ఉద్యోెగులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

Pension Vidroha Day at Pata Collectorate venue
Comments (0)
Add Comment