బిజేవైయం జిల్లా అధ్యక్షులుగా పానుగంటి సతీష్ రెడ్డి

బతుకమ్మ, నిజామాబాద్

బారతీయ జనత పార్టి యువ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా పానుగంటి సతీష్ రెడ్డి ని నియమిస్తు రాష్ర్ట అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపూరి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిల ల సూచనలతో నూతన జిల్లా అధ్యక్షుడిగా డిచ్ పల్లి మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన పానుగంటి సతీష్ రెడ్డి ని నియమించడం జరిగిందని ఉత్తర్వలు జారీ అయ్యాయి. నిన మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన రాజశేఖర్ రెడ్డి స్థానంలో తనను నియమించినందుకు పార్టి నేతలకు ధన్యవాదాలు.. జిల్లాలో బిజేవైయం బలోపేతానికి పాటు పడుతానని సతీష్ రెడ్డి అన్నారు.

 

Panuganti Satish Reddy as the BJym district president
Comments (0)
Add Comment