ఏసీబీ చిక్కిన పంచాయతీ కార్యదర్శి

. రూ.2వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

నందిపేట్, బతుకమ్మ: నందిపేట మండల కేంద్ర గ్రామ పంచాయతీ సెక్రటరీ నవీన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రూ.2వేలు లంచం తీసుకుంటుండగా నవీన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నవీన్ నందిపేట మండలం ఉమ్మెడకు చెందిన వ్యక్తి. ఇటీవల పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు.

Panchayat secretary caught in ACB
Comments (0)
Add Comment