పద్మశాలీల ర్యాలీ

బతుకమ్మ, బాల్కొండ: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముప్కాల్ మండల కేంద్రంలో పద్మశాలీలు శోభాయాత్ర నిర్వహించారు. సంఘ భవనం నుంచి హనుమాన్ మందిరం వరకు కొనసాగిన శోభాయాత్రలో పాటలు పాడుతూ భజన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బాల్కొండ నియోజకవర్గ పద్మశాలీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నర్సన్న, జిల్లా పద్మశాలీ సంఘం కార్యదర్శి గురుడు దయానంద్, సంఘం అధ్యక్షులు చిలుక గోపాల్, బ్రహ్మదండి చిన్నయ్య, చిలుక సుదర్శన్  పద్మశాలీ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Padma Shali rally
Comments (0)
Add Comment