రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం – నిజామాబాద్ నగరంలో గుర్బాభాది రోడ్డులోని నిజాంకాలనీకి వెళ్లే చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. శనివారం ఉదయం నగరంలోని నిజాంకాలనీకి చెందిన అన్వర్ హుస్సెన్ (45) తన ఇంటి నుంచి గంజి వైపు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్వర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

One died in a road accident
Comments (0)
Add Comment