- పెరిగిన భూగర్భ జలాలు
బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు11: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రధాయని అయినటు వంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల్లో ఆనందం తాండవిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈనెల 7వ తేదీన స్థానిక జిల్లా రైతులకు నీరు అందించే లక్ష్మీ ద్వారా నీటి విడుదల చేయడంతో కాలువ కింద ఉన్న చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయ బావుల్లో, బోరు బావుల్లో నీరు పుష్కలంగా రైతుల పంటలకు అందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్మీ కాల్వ ద్వారా స్థానిక నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్, మోర్తాడ్ , కమ్మర్ పల్లి మండలాల్లోని రైతులకు సాగునీటి కోసం విడుదల చేసే లక్ష్మీ కాలువ నీరు పంట క్షేత్రాలకు, చెరువులకు వచ్చే నీటి తోనే రబీ, ఖరీఫ్ రెండు పంటలు పండుతాయని రైతులు తెలిపారు. లక్ష్మీ కలువ రాకతోనే ఈ ప్రాంతం సిరి సంపదలతో అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకున్నారు.
లక్ష్మీ కాలువ బాల్కొండ నియోజకవర్గంలో 3.5 కిలోమీటర్లు దూరం పొడవు ప్రయాణిస్తుంది. ముప్కాల్, మోర్తాడ్, కమ్మర్ పల్లీ మండలాలకు నీరు అందిస్తుంది. ఈ కాల్వ కింద 63 చెరువులు నింపుతారు. లక్ష్మీ కాలువ, నవాబ్, వేంపల్లి, హనుమత్ రెడ్డి ఎత్తిపోతల పథకాలు తో సహా 25,763 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం కోసం నీటి విడుదల జరుగుతుంది.
భూగర్భ జలాలు పెరిగాయి..
హరీష్, రైతు , శెట్ పల్లి.
లక్ష్మీ కాల్వ ద్వారా నీటి విడుదల చేయడంతో శేట్ పల్లీ ఊర చెరువులోకి నీరు రావడంతో చుట్టుపక్కల ఉన్న బావుల్లోను, బోరు బావుల్లోను భూగర్భ జలాలు పెరిగి పంటలకు నీరు పుష్కలంగా అందుతుంది. కలువ ద్వారా నీరు రావడంతో చాలా సంతోషంగా ఉంది.
పంటలు పండుతాయి..
చిన్న గంగాధర్, రైతు, శెట్ పల్లీ.
లక్ష్మీ కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో నీరు చెరువులోకి రావడంతో రబీలో పసుపు, మొక్కజొన్న, వరి, సోయా పంటలకు పుష్కలంగా నీరందుతుంది. లక్ష్మీ కాలువ నీటితోనే ఈ ప్రాంతం సిరి సంపదలతో అభివృద్ధి చెందింది.
పంటల సాగు కోసమే నీటి విడుదల..
సురేష్ డీ ఈ ఈ (నీటిపారుదల శాఖ)
రైతుల పంటల కోసమే కాలువల ద్వారా నీటి విడుదల చేస్తున్నాం. లక్ష్మీ కాలువ కింద 63 ఉన్నాయి.ఈ చెరువులను నింపి రైతులకు సాగు నీరు అందించడం జరుగుతుంది.