గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణ కేంద్రంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఎమ్మార్వో శివ ప్రసాద్, సీఐ సంపత్, ఎస్సై సాయికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సిద్ధ రామేశ్వర టెంపుల్ పక్కన ఉన్న చెరువును,గణనాథులు ఊరేగింపుగా వెళ్లే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణనాథుల శోభాయాత్రను నిర్వహించాలని, పోలీసులతో సమన్వయం చేసుకొని వారి సూచనలను పాటిస్తూ నిర్దేశించిన మార్గం మీదుగా శోభయాత్ర జరపాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Officials who inspected the Ganesh immersion arrangements
Comments (0)
Add Comment