- బతుకమ్మ ఎఫెక్ట్
- అభ్యంతరాలు పరిష్కరించాకే జాబితా
- సీసీఎల్ఏ కమిషనర్ ఆదేశాలు
బతుకమ్మ హైదరాబాద్ : త్వరలోనే తహసీల్దార్లం అయిపోతామనే ఊహల్లో ఉన్న నా యొక్క తాసిల్దార్ ఆశలు ఆవిరయ్యాయి. అక్రమ మార్గంలో పదోన్నతి పొందాలనుకున్న, సిసిఎల్ఏ లోని విభాగం ఉద్యోగులు అభ్యంతరాలను పక్కనపెట్టి జాబితా ప్రకటించాలనుకున్న దానిపై ఈనెల 19న బతుకమ్మ పత్రికలో పదోన్నతిలో దొర్లిన తప్పులు కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన సీసీఎల్ఏ కమిషనర్ ముందుగా పదోన్నతులను నిలిపివేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
పదోన్నతులు వాయిదా..
పదోన్నతుల కోసం సీనియారిటీ ప్రకారం వివరాలు పంపించాలని సిసిఎల్ఏ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఎన్నికల ముందు అందాయి. కలెక్టరేట్ లోని పరిపాలన అధికారులు, యూనియన్ నాయకులు కలిసి తమకు అనుకూలమైన వారి పేర్లను ముందువరుసలో చేర్చారు. దీనికిగాను కొందరు ముడుపులు చెల్లించుకున్నట్లు సమాచారం. జిల్లాల నుంచి వచ్చిన జాబితాను ప్రకటించి అభ్యంతరాలు ఉంటే విన్నవించుకోవాలని ఎన్నికలకు ముందే సీసీఎల్ఏ కమిషనర్ సూచించారు. తప్పులు దొర రాయని తెలుసుకున్న బాధితులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలను తెలిపారు. దీనికి తోడు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పరిష్కరించాకే జాబితా..
రాష్ట్రవ్యాప్తంగా బాధితుల నుంచి అభ్యంతరాలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సింది పోయి అదే జాబితాను ప్రకటిద్దామని వచ్చిన సిబ్బందిపై కమిషనర్ మండిపడ్డట్లు తెలిసింది. ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని కరాకండిగా తేల్చి చెప్పినట్లు సమాచారం. అభ్యంతరాలు కోర్టు కేసులు పరిష్కారం కాగానే మరో జాబితాను ప్రకటించాలని కమిషనర్ ఆదేశించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.