బతుకమ్మ, మోర్తాడ్: ధర్మోరా గ్రామానికి చెందిన ముస్కు భూమారెడ్డి అనారోగ్యంతో మరణించారు. గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భూమారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపాన్ని తెలపడం జరిగింది. అలాగే అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మండల రాజేశ్వర్ కు ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయాలయి ఆపరేషన్ జరిగింది. ఈరోజు ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు,గ్రామ కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు దేవేందర్, శ్యాం గౌడ్,నరేష్,మహేష్, రాజు, నవీన్,అనిల్, నిశాంత్ కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.