మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సెక్షనా మజాకా

 . . కాసుల వేటతో కోట్ల రూపాయల బల్దియా ఆదాయానికి  గండి

. . .  కాసులు కక్కుర్తితో కమర్షియల్ కాదు డొమెస్టిక్ పేరిట ఆస్తి పన్ను వసూలు

. . . ఇన్చార్జి ఆర్ఓ పై ఏసీబీ రైడ్ తర్వాత వెలుగులోకి వస్తున్న నిజాలు

బతుకమ్మ, నిజామాబాద్ :

నిజామాబాద్ నగర నడి బోడ్డున ఉన్న ఖలీల్ వాడి, ప్రగతి నగర్ , ద్వారక నగర్, సరస్వతి నగర్ లో ప్రతి నిత్యం వైద్య సేవల పేరిట జరుగుతున్న టర్నోవర్ కోట్ల రూపాయాలు . అక్కడ హస్పీటల్స్, నర్సింగ్ హోంలు, క్లీనిక్ లు వందల సంఖ్యలో ఉండగా వాటి నిర్మాణం కార్పొరేట్ హస్పీటల్ కు తిసిపోని నిర్మాణం తో అక్కడ వైద్య సేవల పీజుల వసూళ్లు చుక్కలు చూపించే చోట హస్పీటల్  లను నిర్వహిస్తున్న వైద్యులతో మున్సిపల్  రెవిన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. అక్కడ వైద్యుల నుంచి ఇంటి పన్ను రూపంలో మాత్రమే ఆస్థి పన్ను వసూలు అవుతుంది. అక్కడ సాధరణంగా కమర్షియల్ టాక్సు వసూలు చేయాల్సిన చోట డోమేస్టిక్ వసూలు అవుతుంది. దాని ద్వార ప్రతి ఎడాది కోట్ల రూపాయాల అదాయం పోగోట్టుకుంటుంది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…

నిజామాబాద్ నగరంలోని ఎలమ్మగుట్ట చౌరస్తా వద్ధ ఉన్న ప్రముఖ మల్టి స్సెషాలిటి హస్పీటల్ ను రెవిన్యూ సెక్షన్ పంక్షన్ హల్ గా చూపించారు.  ఈ కారణంతో అక్కడ ప్రతి సారి బల్ధియాకు రావాల్సిన ఆదాయంకు బారీగా గండిపడింది. నిత్యం వందల మంది ఓపి, 100 పడక ఆసుపత్రిని కళ్యాణ మండపంగా చూపించడంతో బల్ధియాకు రావాల్సిన పన్నులో కోతలు పడ్డాయి.

నగరంలో మూడు నక్షత్రాల హోటల్ నిర్వహకులతో బల్థియా అధికారులు లోపాయికారిగా ఓప్పంధం ఉంది. పార్కింగ్ స్థలంలో కాంప్లెక్స్ కట్టిన పట్టించుకోలేదు. దానికి ప్రతి ఎడాది చెల్లించాల్సిన టాక్స్ వసూలు చేయకుండా సహయ సహకారాలు అందిస్తున్నారు. కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు కేసుల పేరిట బల్ధియా ఆదాయం కు గండి కోట్టారు.చిన్న చితకగా 10 వేల బకాయిలు ఉన్న ఓంటరి మహిళ ఇంటిని ఎల్లమ్మగుట్టలో జప్తు చేస్తామని నానా యాగి చేసింది నిజామాబాద్ బల్ధియా రెవిన్యూ అధికారులు.

నిజామాబాద్ నగరంలోని బోదన్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ లు, అసుపత్రులకు, ఆపార్ట్ మెంట్ లు, డూప్లెక్స్ నివాసాల నుంచి వసూలు అయ్యే ప్రాపర్టి ట్యాక్స్ కు, మెజార్టి ఎరియాలో వసూలు అయ్యే టాక్సులకు చాలా తేడా ఉంది. ఇక పంక్షన్ హల్ లు, గెస్ట్ హౌజ్ లనుంచి వసూలు అయ్యే టాక్స్ ఇంటి పన్నులను మించడం లేదు. ఇదంతా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవిన్యూ సెక్షన్ మాయాజాలం. అస్థిపన్నుల వసూళ్లకు ముదింపు చెపట్టిన, భువన్ యాప్ ద్వార లెక్కలు వేసిన, ఆటో మేటిక్ మ్యూటేషన్ జరిగిన బల్ధియా ఆదాయం మాత్రం గోర్రే తోక బెత్తేడు కుడా పేరుగలేదు. రెవిన్యూ సెక్షన్ లో బిల్ కలెక్టర్ మొదలుకోని ఆర్ ఓ వరకు జరిగే తతంగం బల్ధియా ఆదాయానికి గండి అధికారులకు కాసులు కురిపిస్తోంది.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు రెవెన్యూ ( ఆదాయం) లో జరిగిన అవినీతి, అక్రమాల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవిన్యూ సెక్షన్ లొ రెండు దశాబ్దాలు పైగా తీష్ట వేసిన సూపరింటెండెంట్ , ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టాలని ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసి రిమాండ్ కు తరలించడంతో రెవిన్యూ సెక్షన్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.  ముఖ్యంగా గత కొంతకాలంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఆస్తి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడినట్టు తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయల ఆదాయం రాకుండా బ్రేకులు  వేసినట్టు తెలుస్తుంది. దాని వెనుక అంత రెవిన్యూఫెక్షన్ మాయాజాలం ఉందనేది బహిరంగ రహస్యం. నిజామాబాద్ జిల్లా కేంద్రం 2011 జనాభా లెక్కల ప్రకారం మూడు లక్షల జనాభా 57 వేల గృహాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. కానీ నిజామాబాద్ నగరం విస్తరించి దశాబ్దాలు గడుస్తుంది. నిజామాబాద్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారి 2 దశాబ్దాలు పూర్తయ్యాయి. 50 డివిజన్ ల స్థానంలో 60 డివిజన్ లతో రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగు లేదా ఐదు స్థానం కోసం పోటీ పడుతుంది. కానీ ఆదాయానికి వచ్చేసరికి రెవిన్యూ సెక్షన్ అధికారుల మాయాజాలంతో రావాల్సిన ఆదాయానికి గండి కోట్టారు. ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 80 వేల ఇండ్లు, కమర్షియల్ దుకాణాల ద్వార ప్రతి ఎడాది పన్నుల రూపంలో వస్తుంది కేవలం రూ.27 కోట్లు మాత్రమే. బడ్జేట్ మాత్రం ఎనాడో వంద కోట్లు దాటి పోయింది.

నిజామాబాద్ నగరం  నలుమూలల విస్తరించింది. ప్రస్తుతం 5 లక్షలకు పైగా జనాబా విస్థరించింది. ఐతే నిజామాబాద్ బల్ధియా ప్రధాన ఆదాయం ఆస్థి పన్ను మాత్రమే. కార్పొరేషన్ కు సంబంధించిన కాంప్లెక్స్ లు ఇతర మార్గాల ద్వార వచ్చే ఆదాయం ఎ మూలకు సరిపోదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ల తర్వాత ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రధాన మైనది. కాని అస్థి పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఉద్యోగుల జీత భత్యాలు, పించన్ లకు సరిపోవడం లేదు. దానితో కార్పొరేషన్ పరిదిలో డేవలప్ మెంట్ కు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్ లు దిక్కుగా మారాయి. కాని ఎన్నడు బల్ధియా పాలక వర్గాలు, అధికార యంత్రాంగం బల్ధియాకు గుండే కాయాలాంటి రెవిన్యూ సెక్షన్ లోని అవినితి తిమింగాలాల గురించి పట్టించుకుంటే నిజామాబాద్ తో పాటు మున్సిపాల్టి నుంచి కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన కరీం నగర్ తో నైనా డేవలప్ మెంట్ లో పోటి పడేది అని చెప్పాలి.

Municipal Corporation Revenue Section Majaka
Comments (0)
Add Comment