కస్తూర్బా విద్యాలయాల సముదాయాన్ని తనిఖీ చేసిన మునిసిపల్ కమిషనర్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ పరిధిలోని 2వ డివిజన్ ప్రాంతంలో ఉన్న కస్తూర్బా విద్యాలయాల రెసిడెన్షియల్ సముదాయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ మంద మకరంద పరిశీలించారు.

అక్కడ విద్యార్థులకు బోజనవసతులు, శుభ్రత, పారిశుధ్యం ఇతర విషయాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ అధికారులకు, ఎడ్యుకేషన్ డిపర్మెంట్ అధికారులకు విద్యాసముదాయాల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

Comments (0)
Add Comment