గోశాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నాగారం గుట్ట మీద నుండి వొచ్చే వర్షపునీరు మార్గమధ్యలో గోశాల మీదుగా ప్రవహిస్తుంది, అక్కడక్కడ వర్షపు నీరు నిలుస్తుందని కాలనీవాసులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో, సరియైన డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళిక తయారు చేసి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ సోలోమాన్, శానిటరీ ఇన్స్పక్టర్ ప్రభుదాస్ మరియు సమీప మల్లారం తండ వాసులు పాల్గొన్నారు.

Municipal Commissioner visited Gosha
Comments (0)
Add Comment