. . . నిజామాబాద్ జిల్లాలో పలువురు ఎస్సైలకు స్థానచలనం
బతుకమ్మ చీఫ్ బ్యూరో
మల్టీ జోన్ పరిధిలో పలువురు ఎస్సైలకు స్థానచలనం కలిగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ -1 పరిధిలోని 40 మంది ఎస్సైలకు స్థాన చలనం కలిగింది. అందులో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ఎస్సైలను ట్రాన్స్ ఫర్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఎం.డి. యాసర్ అరాహత్ కు 2వ టౌన్ ఎస్ హెచ్ వోగా అక్కడ పని చేస్తున్న రాంను సిరికొండ ఎస్ హెచ్ ఓగా బదిలీ చేశారు. 3వ టౌన్ ఎస్సై ప్రవీణ్ ను ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ స్టేషన్ ఎస్సై-1గా, నిజామాబాద్ లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న శ్రీకాంత్ 4వ టౌన్ ఎస్ హెచ్ వోగా, 4వ టౌన్ లో పని చేస్తున్న ట్రాఫిక్ ఎస్సైగా స్థానచలనం కలిపించారు.
నిజామాబాద్ కు కేటాయించబడిన కె.వెంకట్రావ్ కు 5వ టౌన్ ఎస్ హెచ్ వోగా , నవీపేట్ ఎస్సై యాదగిరిని మోపాల్ ఎస్సైగా, వేల్పూర్ ఎస్ హెచ్ వో వినయ్ కుమార్ ను నవీపేట్ ఎస్ హెచ్ వోగా, బోధన్ రూరల్ ఎస్ హెచ్ వో నాగ్ నాథ్ ను వేల్పూర్ ఎస్ హెచ్ వోగా, కమ్మర్ పల్లి ఎస్ హెచ్ వో రాజశేఖర్ ను బోధన్ రూరల్ ఎ స్ హెచ్ వోగా, మోర్తాడ్ ఎస్ హెచ్ వో అనిల్ రెడ్డి కమ్మర్ పల్లి పీఎస్ కు, భీంగల్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిబాబును నందిపేట్ ఎస్ హెచ్ వోగా ట్రాన్స్ ఫర్ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో మహేష్ ను భీంగల్ కు బదిలీ చేయగా, మోపాల్ ఎస్ హెచ్ వో గంగాధర్ ను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై-1గా , నిజామాబాద్ కేటాయించబడిన సంజీవరావును మహిళ పోలీస్ స్టేషన్ ఎస్సై గా , ధర్పల్లి ఎస్ హెచ్ వో విక్రమ్ ను నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై1గా , నిజామాబాద్ లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న నారాయణను మెండోరాకు, నిజామాబాద్ కు కేటాయించిన హబీబ్ ఖాన్ ను బోధన్ టౌన్ 2వ ఎస్సైగా, ఎన్ఐబీలో ఉన్న బాబురావును నిజామాబాద్ రూరల్ పీఎస్ 2వ ఎస్సైగా, సీఎస్ బీలో ఉన్న కె.నర్సయ్య 3వ టౌన్ పీఎస్ 2వ ఎస్సైగా, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 5వ టౌన్ 2వ ఎస్సైగా, పీసీఆర్ లో ఉన్న సత్యంను డిచ్ పల్లి 2వ ఎస్సైగా, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఉదయ్ కుమార్ ను 4వ టౌన్ 2వ ఎస్సైగా , విఠల్ రావును నిజామాబాద్ సీసీఎస్ కు, దేవకుమార్ ను సీసీఆర్ బీకి, వి.ఆర్.లో ఉన్న హన్మండ్లును 2వ టౌన్ రెండవ ఎస్సైగా, చంద్రమోహన్ కు సీసీఎస్ కు, నిర్మల్ జిల్లా కుంటల ఎస్ హెచ్ వో రజనీకాంత్ ను ముప్కాల్ ఎస్ హెచ్ వోగా, అక్కడ ఉన్న భాస్కరచారిని కుంటల ఎస్ హెచ్ వోగా,రుద్రూర్ ఎస్ హెచ్ వో అప్పారావును ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ఎస్ హెచ్ వోగా, బోథ్ ఎస్ హెచ్ వో రామును ఏర్గట్ల ఎస్ హెచ్ వోగా, ఏర్గట్ల ఎస్ హెచ్ వో మచ్చేంధర్ ను బోధన్ టౌన్ ఎస్సై 1గా, బజార్ హత్నూర్ ఎ స్ హెచ్ వో నరేష్ ను బాల్కొండ ఎస్ హెచ్ వోగా , భైంసా ఎస్సై1 మహ్మద్ షరీఫ్ ను 1వ టౌన్ రెండవ ఎస్సైగా, డిచ్ పల్లి ఎస్సై మహేష్ ను 3వ టౌన్ ఎ స్ హెచ్ వోగా, నిజామాబాద్ రూరల్ 2వ ఎస్సై రామారావును విఆర్ కు, 5వ టౌన్ 2వ ఎస్సై పాండేరావును విఆర్ కు బదిలీ చేశారు.