బతుకమ్మ, మోర్తాడ్: మదర్ థెరిస్సా అంటే శాంతి, సహనం, ప్రేమకు ప్రతి రూపమని కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ అన్నారు. నేటి యువత సేవా భావములో తోటి వారికి ప్రేమను పంచే విధానంలో మదర్ థెరిస్సా ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం మదర్ థెరిస్సా 114వ జయంతిని కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గురజాల నర్సారెడ్డి, తుమ్మల రాజ్ కుమార్, కిషోర్, తాడూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.