ఎంపీడీవో శ్రీనివాస్
బతుకమ్మ , జుక్కల్ : చిన్నారులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఎంపీడీవో శ్రీనివాస్ ఆదేశించారు. జుక్కల్ మండలంలోని చిన్న ఏడ్గీ గ్రామంలో అంగన్ వాడి సెంటర్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ప్రతిరోజు అంగన్ వాడి సెంటర్ ను తెరిచి ఉంచాలని అంగన్ వాడి కార్యకర్త చంద్రకళను ఆదేశించారు. చిన్నారులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని పౌష్టికాహారం అందించాలని ఆయన ఆదేశించారు. అంగన్ వాడి రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్ అంగన్వాడి సెంటర్లు ప్రతిరోజు చర్చించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అనే ఆదేశించారు.