రుద్రూర్, ఆగస్టు 12 బతుకమ్మ :రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఎస్సై అప్పారావు పోగొట్టుకున్న ఫోన్ను బాధితురాలికి అందజేశారు. మండలంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన సీతా బాయ్ తన ఫోన్ను 20 రోజుల క్రితం పోగొట్టుకుంది. తన సెల్ ఫోన్ పోయిందని రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఈ కేసుపై దృష్టి సారించిన పోలీసులు పోగొట్టుకున్న ఫోన్ ను సిఇఐఆర్ పోర్టల్ ద్వారా వెతికి బాధితురాలికి అప్పజెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.