. ప్రతిబూత్ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో మంగళవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి బూత్ స్థాయిలో బీజేపీ తరఫున 200 మందికిపైగా నాయకులు పనిచేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో అల్లర్లు, అలజడలు, ఉగ్రమూకల దాడులు జరిగాయని, కానీ ప్రస్తుతం మోడీ పాలనలో దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారన్నారు. ప్రపంచంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఆ దేశాలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత దేశం లోని ప్రతి భారత పౌరునిపై ఉందన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, రాకేశ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, నియోజకవర్గ బాధ్యులు, ఆయా మండలాల అధ్యక్షులు, కార్పొరేటర్ల, నాయకులు తదితరులు పాల్గొన్నారు.