బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా సేవ చేయడం అంటే దేశ సేవ చేయడమేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ‘వారియర్స్’ స్టడీ సర్కిల్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. పేద అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, స్టడీ సర్కిల్ అకాడమీ మేనేజ్ మెంట్ మామిడి రమాకాంత్, ధర్మారావు, మధుసూదన్ రావు, అభ్యర్థులు పాల్గొన్నారు.