బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల ఆవరణ అధ్వానంగా మారింది. పాఠశాలను అనుకొని ఉన్న మురికి కాలువలో చెత్త చెదారం పేరుకుపోయి కంపు కొడుతుంది .చెత్తను సకాలంలో తీసివేయకపోవడంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు చెత్తచెదారాన్ని శుభ్రం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.