తెలంగాణ మహిళలోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

  •  బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

బతుకమ్మ, ఏర్గట్ల: కే టీ ఆర్ తెలంగాణ మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారిక మీద దృష్టి పెట్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలను మహిళల కోసం ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. గురువారం రోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల మీద అనుచిత వాక్యాలు చేస్తూ మహిళలందరూ వారి కుటుంబాలతో కలిసి బస్సులలో బ్రేక్ డాన్సులు చేసుకోండి అని అవమానకర రీతిలో మాట్లాడడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఏర్గట్ల మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ మహిళాల యొక్క ఆర్థిక స్థితిని పెంచి దేశంలో తెలంగాణ మహిళలను అత్యంత శక్తివంతంగా మార్చాలన్న రేవంత్ రెడ్డి ఆలోచనకు మహిళలంతా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ మహిళలను బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటూ అవమానకర రీతిలో మాట్లాడడం యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించడం అని ఆయన అన్నారు. తక్షణం కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివ కుమార్, అడెం గంగాప్రసాద్, ముస్కు మోహన్,లింగారెడ్డి, జీవన్,లింగారెడ్డి కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

KTR should apologize to Telangana women
Comments (0)
Add Comment