బతుకమ్మ, భీంగల్ : భీంగల్ లో శనివారం అర్థరాత్రి కిరణం షాప్ లో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. పట్టణం లోని మజీద్ కు సమీపంలో ఉన్న నిఖీల్ కిరణం షాప్ షటర్ ను గునపంతో పైకి లేపి షాప్ లోకి ప్రవేశించారు. షాప్ గల్లాలో ఉన్న డబ్బులను దుండగులు ఎత్తుకెళ్లారు.గత వారం క్రితం పట్టణం లోని ప్రభుత్వ స్కూల్ లో చొరబడిన దొంగలు పాఠశాల లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న చిల్లర ఎత్తు కెళ్లారు. తన షాప్ లో దొంగతనం జరగగా ఆ షాప్ ఓనర్ దేవరశెట్టి రాజ ప్రసాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.