. పాస్ పోర్టు డిపాజిట్ చేయాలి
. సాక్షులను భయపెట్టొద్దు
. కవితకు సుప్రీం ఆదేశాలు
బతుకమ్మ, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి రెండు కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో రూ.10 లక్షల చొప్పున పూచీకత్తుతో కవితను బెయిల్ పై విడుదల చేసేందుకు సుప్రీం న్యాయమూర్తులు గవాయ్, విశ్వనాథ్ లతో కూడిన ధర్మాసనం అనుమతించింది. అలాగే పాస్ పోర్ట్ ను డిపాజిట్ చేయాలని, సాక్షులను భయపెట్టడం వంటివి చేయకూడదని కోర్టును ఆమెను ఆదేశించింది. కవితను ఈ ఏడాది మార్చి 15న సాయంత్రం ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను సీబీఐ అరెస్టు చేసింది. 153 రోజుల తరువాత నేడు కవిత జైలు నుంచి విడుదల కానుంది.