కవిత బెయిల్ కు అర్హురాలు

బతుకమ్మ, నిజామాబాద్ :ఐదు నెలల కాలం జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ కు అర్హురాలని సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం ఆయన తన వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ, ఈడీల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. న్యాయమూర్తులు బీ ఆర్ గవాయ్, కెవి విశ్వనాథ్ లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న రిటర్నబుల్ నోటీసు జారీ చేసింది. గతవారం లిక్కర్ కేసులో ఏ2గా ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.

Kavita deserves bail
Comments (0)
Add Comment