పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

ఉపాధ్యాయురాలు పల్నాటి పద్మారాణి
బతుకమ్మ, నిజామాబాద్ బ్యూరో : పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఉపాధ్యాయురాలు పల్నాటి పద్మారాణి అన్నారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. సంఘం నాయకులు
పల్నాటి పద్మారాణికి శాలువా మెమొంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు పల్నాటి
పద్మారాణి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులదే అన్నారు. విద్యార్థి దశ నుంచి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయిలో నిలబెట్టడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, యాదగిరి, పూలగం హనుమాన్లు, గుజ్జ రాజేశ్వరి ,పలనాటి లక్ష్మి, వాసం జయ తదితరులు ఉన్నారు.

It is teachers who shape the future of children
Comments (0)
Add Comment