- నిజామాబాద్ ఎంపీ అరవింద్
బతుకమ్మ, నిజామాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆయన సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమల శ్రీవారిని భక్తితో కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని అన్నారు. టిటిడి సభ్యులు ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక దర్శనం చేయించారు.